లలితా జ్యూవెలరీలో బంగారు బ్రాస్‌లెట్ చోరీ

బుధవారం, 22 జనవరి 2020 (10:47 IST)
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో ఉన్న లలితా జ్యువెలర్స్‌ దుకాణంలో సిబ్బంది దృష్టి మళ్లించిన దొంగలు 92 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. సంస్థ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4 గంటలకు గుంపుగా వచ్చిన కొందరు కొనుగోలుదారులు అక్కడ విధుల్లో ఉన్న వ్యక్తి దృష్టి మళ్లించేలా చేసి రూ.3.5 లక్షల విలువ చేసే రెండు బంగారు గొలుసులు, ఒక బ్రాస్‌లెట్‌ చోరీ చేసినట్టు గుర్తించారు.
 
 
సంస్థలో ఇటీవలే నిర్వహించిన ఆడిట్‌లో ఈ విషయం బయటపడింది. సీసీ కెమెరాలను పరిశీలించగా గుంపుగా వచ్చిన వారిలో ఎవరో కాజేసినట్లుగా గుర్తించారు. పంజాగుట్ట పోలీసులకు మేనేజర్‌ కె.హరిసుందర్‌ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన క్రైమ్ టీమ్ దుకాణానికి వెళ్లి పరిశీలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు