కూకట్పల్లికి చెందిన సునీత అనే టెక్కీ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యగా మృతురాలి సిమ్ కార్డు ఆధారంగా కాల్ లిస్ట్, వాట్సాప్ మెసేజ్లను పోలీసులు సేకరించారు.
కూకట్పల్లి నుంచి గచ్చిబౌలిలోని తాను పనిచేసే కంపెనీకి వెళ్లే ఇతను సునీతను మాదాపూర్ భాగ్యనగర్ సహకార సొసైటీ రోడ్డులో కలుసుకునేవాడని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఈ నెల 13న కూడా కలిసినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత రోజు ప్రేమికుల దినోత్సవం. తన ప్రేమను అంగీకరించాలని సునీత తనకు చెప్పిందని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించిందని ఆ యువకుడు చెపుతున్నాడు.