ప్యాంటు విప్పుతా, వీడియో తీసుకుంటావా?: విద్యార్థి తల్లితో ఉపాధ్యాయుడు అసభ్యం

గురువారం, 25 మార్చి 2021 (22:37 IST)
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే పాఠశాలను మద్యం షాపులా మార్చేశాడు. తరగతి గది లోపల బిర్యానీ పొట్లం తెచ్చుకుని తింటూ ఎదురుగా మద్యం బాటిల్ నుంచి మద్యం సేవిస్తూ విద్యార్థుల ముందే చిత్తయిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయితీలోని కృష్ణాపురం ప్రాథమిక పాఠశాలలో జరిగింది.
 
పాఠాలు సరిగా వినడం లేదంటూనో, సరైన జవాబులు చెప్పడం లేదంటూనో విద్యార్థినీవిద్యార్థుల బట్టలు విప్పించి నిలబెడుతున్నాడనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఓ విద్యార్థిని బట్టలు విప్పి నానా హంగామా చేస్తుంటే ఆ విషయాన్ని నిలదీసేందుకు వచ్చిన మహిళపై మండిపడ్డాడు.
 
ఉపాధ్యాయుడి ఆగడాలను వీడియో తీస్తున్న మహిళ వైపు చూసి... ప్యాంటు కూడా విప్పుతా వీడియో తీసుకుంటావా అని బరితెగించి మాట్లాడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు అతడి తీరుపై మండిపడ్డారు. తమ పిల్లలను అలాంటి పాఠశాలకు పంపేది లేదని తేల్చి చెబుతున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు