కృష్ణాజిల్లాలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం

శనివారం, 29 ఆగస్టు 2020 (09:59 IST)
కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం చెక్పోస్ట్ పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి భారీగా మద్యం సీసాలను, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. డియస్సీ  కార్యాలయంలో స్పెషల్ ఏన్ ఫోర్స్ మెంట్ అధికారి వకూల్ జిందాల్ ఆధ్వర్యంలో మీడియా ముందు హాజరు పరిచారు. 
 
తెలంగాణ నుండి అక్రమంగా మద్యం తెస్తుండగా పెద్దాపురం వద్ద  వాహనాల తనిఖీల్లో రెండు బైక్ లను తనిఖీలు చేయగా వారి వద్ద నుండి 645 మద్యం సీసాలను పట్టుకున్నామని వకూల్ జిందాల్ తెలిపారు.

ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని, వీరు ఇద్దరు ఇబ్రహీంపట్నం మం కేతనకోండ గ్రామానికి చెందిన వారుగా గుర్తించామని తెలిపారు. తెలంగాణ నుండి తక్కువ ధరకు మద్యం తీసుకుని వచ్చి ఆంధ్రలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. 
 
మద్యంను అక్రమ రవాణా చేసిన ఎంతటి వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి నిందుతులను పట్టుకున్న పోలీసులను అభినందించి రివార్డులు అందజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు