భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ: 24 గంటల్లో 12,213 కేసులు

గురువారం, 16 జూన్ 2022 (15:52 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 12213 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,32,57,730 కు చేరింది.
 
ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 58,215కు చేరింది. అలాగే  కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 11 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,24,803 కి చేరింది.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7624 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీల సంఖ్య 4,26,74,712కు చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు