సోషల్ మీడియాలో పొలిటికల్ పంచ్లు వేసేవారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నెర్రజేశారు. ఇలాంటి పంచ్లతో పాటు.. సెటైర్లు, కార్టూన్లు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సర్కారు హెచ్చరించింది.
తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటూరి కిరణ్ను గుర్తించి అరెస్టు చేశారు. చట్ట సభలను కించపరిస్తే ఎవరిపై నైనా చర్య తీసుకుంటామని అసెంబ్లీ కార్యదర్శి సత్యన్నారాయణ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్, మంత్రులను కించపరుస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.