జ‌గ‌న్ స‌ర్కార్ ప‌థ‌కాల‌పై ఇంటింటికీ 2 బ్రోచ‌ర్ల‌ పంపిణీ!

శనివారం, 6 నవంబరు 2021 (15:24 IST)
ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ అందిస్తున్న ప‌థ‌కాలపై అంద‌రికీ అర్ధం అయ్యేలా బ్రోచ‌ర్లు ప్రింట్ చేయాల‌ని ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలోని ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరాలు పంపిణీకి జగన్ సర్కార్ సిద్ధం అవుతోంది. రాష్ట్రంలో భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం, తాము  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరాల్ని ఇంటింటికి పంపిణీ చేయడానికి ప్రణాళిక శాఖ కసరత్తు పూర్తి చేసింది.
 
 
ప్రభుత్వ పధకాలు స్టేటస్ రిపోర్ట్ ల‌ను అంద‌రికీ అవ‌గాహ‌న అయ్యేలా ప్రింట్ చేసి పంపిణీ చెయ్యడానికి జిల్లా కలెక్టర్లకు ఏపీ ప్రణాళిక శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇంటింటికి రెండు బ్రౌచర్ల రూపంలో ప్రభుత్వం పధకాల వివరాలు పంపిణీ చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు. 
 
 
ఒకటో బ్రోచర్లో రెండవ ఏటా ఇచ్చిన మాటకే పెద్ద పీట, జగనన్న మ్యానిఫెస్టో ఆరు పేజీలు ప్రింట్ చేస్తున్నారు. రెండవ బ్రోచర్లో సంక్షేమ సంతకం రెండవ ఏటా ఇచ్చిన మాటకే పెద్ద పీట మ‌రో 16 పేజీలు ఉంటాయి. బ్రోచర్ల ముద్రణ ఇప్పటికే పూర్తయిందని, ఇవి ఆర్‌డిఓ కార్యాలయానికి చేరాక ప్రణాళికా బద్దంగా ఇంటింటికి పంపిణీ చెయ్యాలని సూచిస్తున్నారు. బ్రోచర్ల ముద్రణ‌, పంపిణీ అనుకున్న సమయానికే అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ల కు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌ కుమార్ లేఖలు రాశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు