రేపు గవర్నర్ తో జగన్ సమావేశం

బుధవారం, 27 అక్టోబరు 2021 (22:38 IST)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. రాజ్ భవన్ కు వెళ్లనున్న సీఎం గవర్నర్ తో సమావేశం కానున్నారు. తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడులు సహా ఇతర అంశాలపై గవర్నర్ కు సీఎం జగన్ వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై అభిమానులు దాడులకు దారితీసిన పరిస్ధితులను గవర్నర్ కు సీఎం వివరించనున్నారు.
 
అంతకు ముందు తెలుగు దేశం పార్టీ నేతలు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల సీడీలు, తగు ఆధారాలను గవర్నర్ కు సమర్పించే అవకాశాలున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో శాసనసభ సమావేశాల నిర్వహించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. వీటిపైనా గవర్నర్ తో చర్చించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్ధితులపైనా గవర్నర్ తో చర్చించే అవకాశాలున్నట్లు తెలిసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు