మొగుడు కాదు కాల యముడు: భార్యను విజయవాడ హోటల్ గదికి తీసుకొచ్చి గొంతు కోసి...

సోమవారం, 14 మార్చి 2022 (10:49 IST)
భార్యాభర్తలన్న తర్వాత గొడవలు మామూలే. రోజులో కనీసం రెండుమూడుసార్లయినా ఏదో ఒక విషయంపై చిన్నచిన్న గొడవలు పడుతుంటారు. ఐతే ఇలాంటి గొడవలను కొందరు భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. కొన్నిసార్లు ప్రాణాలను తీసేందుకు సైతం వెనుకాడరు. విజయవాడలో ఇలాంటి ఘటన జరిగింది. 

 
విజయవాడ గవర్నర్ పేటలోని అశోక్ రెసిడెన్సీలో ఓ గదిలో భార్యాభర్త ఇద్దరూ దిగారు. కాగా వీరిరువురూ మనస్పర్థలు తలెత్తడంతో గత కొంతకాలంగా విడివిడిగా వుంటున్నారు. ఆదివారం నాడు మాట్లాడుకుందాం రమ్మంటూ భార్యను హోటల్ గదికి తీసుకువచ్చాడు భర్త.

 
ఏదో విషయంపై ఇద్దరూ మళ్లీ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త తన వద్ద వున్న కత్తితో భార్య గొంతు కోసి అతి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషనుకి వెళ్లి తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు