థియేటర్లో భీమ్లా నాయక్: కొడాలి నానికి షాక్ ఇచ్చిన పేర్ని నాని.. ఏమైంది?

శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (23:05 IST)
విజయవాడ లోని ఒక ప్రైవేటు సినిమా థియేటర్‌ను ప్రారంభించేందుకు మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు చేరుకున్నారు. అది కూడా భీమ్లా నాయక్ సినిమా ప్రదర్సితం చేయాలనుకున్న థియేటర్. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ సినిమా విడుదలైంది. తన సన్నిహితుడు నిర్మించిన విజయవాడలోని థియేటర్‌కు వెళ్ళారు కొడాలి నాని, పేర్నినాని.

 
అయితే థియేటర్‌ను ప్రారంభించిన తరువాత షోను ప్రారంభించారు నిర్వాహకులు. భీమ్లా నాయక్ సినిమా పేర్లు వేశారు. మంత్రి కొడాలి నాని ఫోన్ ఆపరేట్ చేస్తూ కూర్చున్నారు. కానీ పేర్ని నాని మాత్రం సినిమా చూడటం ప్రారంభించాడు. ఉన్నట్లుండి ఈల వేసి కొడాలి నాని తొడపై చరుస్తూ పిలిచారు. దీంతో షాకయ్యాడు కొడాలి నాని. సినిమా చూడంటూ చెప్పడం ప్రారంభించారు. దీంతో కొడాలి నాని కూడా సినిమా చూడడం మొదలెట్టారు.

 
ఆ తరువాత వెంటనే తేరుకున్న కొడాలి నాని ఇక వెళదామా అంటూ సినిమా ప్రారంభమైన 15 నిమిషాల్లోనే థియేటర్ నుంచి వెళ్ళిపోయారు. రాజకీయానికి, సినిమాకు ముడిపెట్టవద్దని ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. అయినా సరే తన సినిమాలను ఎపిలో బెనిఫిట్ షోలు వేయనీయపోవడంతో అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులు భీమ్లా నాయక్ సినిమాను తిలకించడంతో చర్చ ప్రారంభమైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు