మెట్రో రైలు నిర్మాణం విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ త్వరలో సర్దుకుంటాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. అసెంబ్లీ, మొజంజాహీ మార్కెట్ వద్ద మెట్రో రైలు భూగర్భ రైలు ఉంటుందని కేటీఆర్ అన్నారు. మెట్రో కవర్ గానీ ప్రాంతాల్లో బీఆర్డీఎస్, ఎల్ఆర్టీఎస్ ఉంటుందని చెప్పుకొచ్చారు.
మెట్రో రైలును కేవలం 72 కిలోమీటర్లకే పరిమితం చేయమని చెప్పారు. 2040 కల్లా 250 కిలోమీటర్ల మేర విస్తరిస్తామని తెలిపారు. మరోవైపు, మెట్రో రైలు నిర్మాణం కోసం ఇప్పటి వరకు 4,600 కోట్లు ఖర్చయిందని హెచ్ఎంఆర్ డైరెక్టర్ ఓ ఛానల్తో మాట్లాడుతూ చెప్పారు. మెట్రో రైలు పనులను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామన్నారు.