ప్రజా దర్బారుపై KTR వ్యాఖ్యలు.. వీడియో వైరల్

శనివారం, 9 డిశెంబరు 2023 (22:17 IST)
ప్రజా దర్బారుపై మాజీ మంత్రి కేటీఆర్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రజా దర్బార్‌ని తాము ఎందుకు నిర్వహించలేదో ఆయన సోదాహరణంగా వివరించారు. 
 
ప్రజా దర్బార్ గురించి తాము కూడా ఓ సందర్భంలో కేసీఆర్‌ని అడిగామని, ఆయన చెప్పిన సమాధానం విన్నాక ప్రజా దర్బార్ వ్యవహారంపై తమకు స్పష్టత వచ్చిందని కేటీఆర్ అన్నారు. గతంలో ఆయన ఓ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ఇప్పుడు కరెక్ట్‌గా సింక్ అయ్యేలా ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణులు దాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. 
 
ప్రజల ముందు, మీడియా ముందు షో చేయేలానుకునేవారు మాత్రమే ప్రజా దర్బార్ నిర్వహిస్తారని, ఆ ఏర్పాట్లన్నీ షో పుటప్ అని కేసీఆర్ అన్నట్టుగా ఆ వీడియోలో తెలిపారు కేటీఆర్. ప్రజలు ముఖ్యమంత్రికి చెప్పుకునే పరిస్థితి ఉందంటే.. ఆ వ్యవస్థలోనే లోపం ఉన్నట్టు లెక్క. 
 
ఈ సమస్యలన్నీ ఎక్కడికక్కడ పరిష్కారమవ్వాలి, కింది స్థాయి అధికారులెవరూ పని చేయకపోతే అప్పుడు సీఎం దగ్గరకు రావాలి. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం ముఖ్యమంత్రి చేయాల్సినవి కాదు. దానికో యంత్రాంగం ఉంది. వారు ఆ పనులు పూర్తి చేయాలి... అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

ఇన్ని రోజులు కేసీఆర్ గారు ప్రజాదర్బార్ ఎందుకు నిర్వహించలేదు అనే వారికి సమాధనం కేటీఆర్ గారి మాటల్లో ..
కింద ఉన్న లేక్కలే నిదర్శనం https://t.co/XCC17FseHH pic.twitter.com/pwP80WYbsy

— “

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు