నేటి నుంచి శుక్రవారం వరకు ఏపీలో తేలికపాటి వర్షాలు..

బుధవారం, 22 మార్చి 2023 (10:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ శ్రీలంక నుంచి ఈశాన్య మధ్యప్రదేస్ వరకు ద్రోణి కొనసాగడమే ఇందుకు కారణమని తెలిపారు. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ ద్రోణి ప్రభావంతో మంగళవారం అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, ఏలూరు, కాకినాడ తదితర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
అలాగే, నేటి నుంచి శుక్రవారం వరకు వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే ప్రమాదం ఉందని, వర్షం పడే సమయంలో బయటకు వెళ్లొద్దని సూచన చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు