వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఏపీ సర్కారు స్పందన శూన్యం : కేంద్రం

బుధవారం, 22 మార్చి 2023 (08:11 IST)
విశాఖపట్టణంలో మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపించలేదని కేంద్రం తేల్చి చెప్పింది. అందువల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని కేంద్ర పట్ణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. 
 
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, నిజానికి వైజాగ్‌ మెట్రో రైల్ ప్రాజెక్టు సంబంధించి పాలసీని గత 2017లోనే రూపొందించామన్నారు. కానీ, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం నుంచి కనీస స్పందన రాలేదన్నారు. పీపీపీ విధానంలో లైట్ రైల్ ప్రాజెక్టును నిర్మించాలని 2018లో నిర్మించాలని భావించామన్నారు. కానీ, ఏపీ సర్కారు లేదా మరో విదేశీ సంస్థల నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పారు.
 
కాగా, గత 2014-19 మధ్యకాలంలో ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో విశాఖపట్టణంతో పాటు విజయవాడ - గుంటూరు నగరాల మధ్య మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రతిపాదన తెచ్చారు. మెట్రో మ్యాన్ శ్రీధరన్‌తో వైజాగ్‌లో మెట్రో రైల్ నిర్మించే సాధ్యాసాధ్యాలపై సర్వే కూడా చేయించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు