బంగాళాఖాతంలో వాయుగుండం.. విశాఖకు 960 కిమీ దూరంలో

శుక్రవారం, 3 డిశెంబరు 2021 (07:56 IST)
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారిందని, ఇది విశాఖపట్టణంకు ఆగ్నేయంగా 960 కిలోమీటర్ల దూరంలో ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వాయుగుండం వాయువ్య దిశగా పయనించి వచ్చే 24 గంటల్లో తుఫానుగా మారుతుందని ఐఎండీ వెల్లడించింది. 
 
అయితే, వాయుగుండం తుఫానుగా మారితే దీనికి జవాద్ అనే పేరును ఖరారు చేయనున్నారు. అదేసమయంలో ఈ తుఫాను ఈ నెల 4వ తేదీ శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్కా మధ్య తీరం దాటొచ్చని అంచని ఓ ప్రైవేటు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 
 
ఈ కారణంగా ఉత్తర కోస్తా, ఒరిస్సా తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా, ఏపీలోని విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై ఆ మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారును కూడా నియమించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు