ఓరీ దుర్మార్గుడా.. నీకు నా భార్యే కావాల్సి వచ్చిందిరా.. హత్యకు దారితీసిన మేనత్తతో రాసలీలలు

బుధవారం, 26 సెప్టెంబరు 2018 (08:50 IST)
మేనత్త వరుస అయ్యే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడుని మేనమామ దారుణంగా గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని డోర్నకల్ కురవిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
పాలమూరు జిల్లాలోని కొత్తతండాకు చెందిన బానోత్‌ భద్రు, నాగమణి భార్యభర్తలు. భద్రు మేనల్లుడు మాలోత్‌ లింగన్న(25). వారితోనే కలిసివుంటున్నాడు. లింగన్న వ్యవసాయం చేస్తూనే అప్పుడప్పుడు కారు డ్రైవింగ్‌ చేస్తుంటాడు. ఈ పరిస్థితుల్లో రెండేళ్లుగా నాగమణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంలో భద్రు, లింగన్న మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఒక రోజున వీరిద్దరూ ఏకాంతంగా ఉండగా, భద్రు చూశాడు. అప్పటి నుంచి లింగన్నను హత్య చేయాలని భద్రు ఓ నిర్ణయానికి వచ్చాడు. 
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి తండాలోని గణేష్‌ విగ్రహాన్ని యువకులు డీజే సౌండ్‌కు నృత్యాలు చేస్తూ నిమజ్జనానికి ఊరేగింపుగా తరలిస్తున్నారు. వారిలో మేనల్లుడు లింగన్న కూడా ఉండటాన్ని భద్రు చూశాడు. వెనుక నుంచి వచ్చి గొడ్డలితో అతడి తలపై నరికాడు. దీంతో లింగన్న తల పగిలి కింద పడ్డాడు. వెంటనే భద్రు అక్కడి నుంచి పరారయ్యాడు.

రక్తపు మడుగులో ఉన్న లింగన్న తలకు ఓ వ్యక్తి తన షర్ట్‌ గట్టిగా కట్టి మరో వ్యక్తి సాయంతో బైక్‌పై కూర్చోబెట్టుకుని మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించాడు. అక్కడ స్టెచర్‌పై పడుకోబెడుతుండగా లింగన్న మృతిచెందాడు. భద్రు గొడ్డలతో సహా కురవి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు