30 సెకన్ల వ్యవధిలో 30సార్లు నరికారు.. చనిపోయాడో లేదోనని...

సోమవారం, 30 అక్టోబరు 2017 (13:11 IST)
పాతకక్ష్యల నేపథ్యంలో గుంటూరులో దారుణ హత్య చోటుచేసుకుంది. రౌడీ షీటర్ బసవల భారతి వాసు (39)పై నలుగురు దుండగులు దాడి చేశారు. 30 సెకన్ల వ్యవధిలో 30సార్లు నరికారు. అంతటితో ఆగకుండా చనిపోయాడో లేదో చూసుకుని.. గొంతుకోశారు. ఆ తర్వాత వచ్చిన వాహనంలోనే పారిపోయారు. 
 
విద్యానగర్ నాలుగో లైన్లో నివాసం ఉండే వాసు.. మరికొందరితో కలిసి అరండల్ పేట 12వ లైన్ లోని ఓ బిర్యానీ పాయింట్‌కు వెళ్లి, డిన్నర్ ముగించుకుని వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 
 
ఈ హత్య పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని.. అనుమానిత నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నామని చెప్పారు. గుంటూరు మాజీ ఎమ్మెల్యేకు దగ్గరి సన్నిహితుడైన వాసు.. ఇటీవలే ఓ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉంటూ బెయిల్‌పై బయటకు వచ్చినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు