ఆ తెదేపా నేతను చంపింది నేనే... లొంగిపోయిన వైసీపి నాయకుడు

బుధవారం, 26 జూన్ 2019 (17:09 IST)
పాత కక్షలు ఇప్పుడు చెలరేగుతున్నాయా అనే సందేహం వస్తోంది. ఇరు ప్రధాన పార్టీలకు చెందినవారు ఇటీవలి కాలంలో ఘర్షణ పడటం కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఇవి హత్యకు దారి తీస్తున్నాయి. మంగళవారం నాడు మంగళగిరిలో దారుణ హత్యకు గురైన తెలుగుదేశం నేతను చంపిందెవరో తెలుసుకునేలోపుగా తామే హత్య చేశామంటూ వైసీపికి చెందిన నేత శ్రీనివాసరావు యాదవ్ పోలీసుల ఎదుట తన అనుచరులతో లొంగిపోవడం కలకలం సృష్టిస్తోంది. 
 
వివరాలను చూస్తే... మంగళగిరి ద్వారకానగర్‌కి చెందిన 40 ఏళ్ల ఉమా యాదవ్ గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతడు ఇటీవలే గౌతమబుద్ధ రోడ్డు సమీపంలో ఓ ఆఫీసును నిర్మించాడు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో పని ముగించుకుని ఇంటికి వస్తుండగా శ్రీనివాసరావు యాదవ్, అతడి అనుచరులు కొందరు ఉమపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి హత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు