ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు లేవు : డిజిపి రాముడు

సోమవారం, 9 మే 2016 (15:22 IST)
ఏపీలో మావోయిస్టుల కదలికలు లేవని రాష్ట్ర డీజీపీ రాముడు అన్నారు. ఉత్తరాంధ్రలో మావోయిస్టులు కదలికలు ఉన్నాయని చెప్పడంతో ఎంత మాత్రం నిజం లేదన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన సైబర్‌ క్రైం సదస్సులో ఆయన పాల్గొన్నారు. 
 
ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోనే పోలీసు విభాగానికి సంబంధించిన కార్యాలయాల నిర్మాణాలను చేపడతామన్నారు. తిరుమలకు ఎలాంటి ముప్పు లేదని, ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదన్నారు. 
 
తిరుపతి అలిపిరిలోని తనిఖీ కేంద్రం అధునాతన స్కానింగ్‌ మిషన్‌ను ఏర్పాటు చేయాలని టిటిడిని ఆదేశించినట్లు చెప్పారు. వాహనం వెళుతుండగానే ఒక్కసారిగా స్కానింగ్‌ అవుతుందని, దీని వల్ల భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదన్నారు. 
 
ఎర్రచందనం అక్రమ రవాణా కేసుకు సంబంధించి తక్కువ మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయని, అయితే పట్టుబడిన వారందరికీ కఠిన శిక్షలు పడాలన్న ఉద్దేశంతో కేంద్రానికి ఒక లేఖ రాశామని, అదే విషయంపై త్వరలో తెలుగుదేశంప్రభుత్వంపై అసెంబ్లీలో నిర్ణయం కూడా తీసుకోనుందన్నారు. ఎర్రచందనం విషయంలో టాస్క్ ఫోర్స్ తో పాటు పోలీసులు, అటవీశాఖ కలిసి కట్టుగానే పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి