తిరుపతి అలిపిరిలోని తనిఖీ కేంద్రం అధునాతన స్కానింగ్ మిషన్ను ఏర్పాటు చేయాలని టిటిడిని ఆదేశించినట్లు చెప్పారు. వాహనం వెళుతుండగానే ఒక్కసారిగా స్కానింగ్ అవుతుందని, దీని వల్ల భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదన్నారు.
ఎర్రచందనం అక్రమ రవాణా కేసుకు సంబంధించి తక్కువ మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయని, అయితే పట్టుబడిన వారందరికీ కఠిన శిక్షలు పడాలన్న ఉద్దేశంతో కేంద్రానికి ఒక లేఖ రాశామని, అదే విషయంపై త్వరలో తెలుగుదేశంప్రభుత్వంపై అసెంబ్లీలో నిర్ణయం కూడా తీసుకోనుందన్నారు. ఎర్రచందనం విషయంలో టాస్క్ ఫోర్స్ తో పాటు పోలీసులు, అటవీశాఖ కలిసి కట్టుగానే పనిచేస్తున్నారని స్పష్టం చేశారు.