నా భర్త ఆర్కే క్షేమంగా ఉన్నారంటా... హైకోర్టుకు తెలిపిన ఆర్కే భార్య శిరీష

శుక్రవారం, 4 నవంబరు 2016 (12:42 IST)
నా భర్త, మావోయిస్టు కీలక నేత రామకృష్ణ అలియాస్ ఆర్కే క్షేమంగా ఉన్నారనీ అందువల్ల ఆయన ఆచూకీ తెలపాలనీ కోరుతూ తాను దాఖలు చేసిన పిటీషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్కే భార్య శిరీష్ హైకోర్టుకు తెలిపింది. 
 
తాజాగా ఆర్కే క్షేమంగా ఉన్నాడంటూ స‌మాచారం రావ‌డంతో ఆమె శుక్రవారం త‌న భ‌ర్త క్షేమంగా ఉన్నార‌ని హైకోర్టుకు తెలిపారు. దీంతో శిరీష వేసిన హెబియ‌స్ కార్ప‌స్ వ్యాజ్యం ఉప‌సంహ‌ర‌ణ‌కు ఆమె త‌ర‌పు న్యాయ‌వాది ర‌ఘునాథ్ న్యాయ‌స్థానంలో అనుమ‌తి కోరారు. పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ విన్న‌తిని త‌మ‌కు లిఖిత పూర్వ‌కంగా ఇవ్వాల‌ని కోర్టు సూచించింది.
 
ఇదిలావుండగా, విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. మావోయిస్టుల ఆచూకీ కోసం ఆదివాసీలను పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారన్నారు. పోలీసులు మైండ్‌గేమ్ ఆడటంతో అనుమానం వచ్చిందని, ఏపీ డీజీపీ ఆపరేషన్ ఆర్కే పేరుతో అపరేషన్ చేపట్టడంతో మా అనుమానాలు మరింత బలపడ్డాయని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి