ఐదో షో ఏపీ సర్కారు అనుమతి : నెలాఖరు నాటికి శుభం కార్డు : చిరంజీవి

గురువారం, 10 ఫిబ్రవరి 2022 (16:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చేందుకు సమ్మతించిందని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. అలాగే, అన్ని సమస్యలకు ఈ నెలాఖరులోగా శుభం కార్డు పడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. 
 
తాడేపల్లిలోని సీఎం క్యూంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో తెలుగు హీరోలు చిరంజీవి, మహేషఅ బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ తదితరులు సమావేశమయ్యారు. ఆ త ర్వాత చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు తమను ఆహ్వానించినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు పరిశ్రమ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. సీఎం నిర్ణయం మమ్మల్ని అందర్నీ సంతోషపరిచిందన్నారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై నెలాఖరులోగా శుభంకార్డు పడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. 
 
ముఖ్యంగా, చిన్న సినిమాలపై సీఎం జగన్ దృష్టిసారించారని చెప్పారు. ఈ సినిమాలు కూడా విజయవంతం కావాలన్న ఉద్దేశ్యంతో ఆయన మా అందరి కోరికను మన్నించి ఐదో ఆటకు అనుమతించారు. దీని వల్ల చిన్న నిర్మాతలకు, ఇతరులకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది అని చెప్పారు. అలాగ, విశాఖపట్టణంలో తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందాలని ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చెప్పారని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు