గురువుల కన్నా గూగుల్ మిన్న :: ఏపీ విద్యామంత్రి సురేష్

బుధవారం, 6 సెప్టెంబరు 2023 (11:38 IST)
కాలం మారినా.. ఎంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ దారి గురించి చెప్పడానికి ఓ గురువు కావాల్సిందే. అంటే సమాజంలో గురువుకు ఎప్పటికీ ఓ ప్రత్యేక స్థానం ఉంది. అయితే, గూగుల్ వచ్చిన తర్వాత గురువులతో పనేముందని ఏపీ విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదీ కూడా టీచర్స్ డే రోజున ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. 
 
ప్రకాశం జిల్లాలో మంగళవారం గురుపూజోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గురువులు కన్నా గూగూల్ మిన్న అంటూ వ్యాఖ్యానించారు. గూగులు వచ్చాక గురువుల అవసరం పెద్దా లేకుండా పోయిందన్నారు. గురువులకు తెలియని విషయాలు కూడా గూగుల్‍లో శోధిస్తే లభిస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం అందించిన ట్యాబుల్లో సమస్త సమాచారాన్ని బైజూస్ టెక్నాలజీ పొందుపరిచిందని వివరించారు. గురువుల స్థఆనంలో ఇపుడు గూగుల్ వచ్చిందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు