కోడిపుంజు కనిపించట్లేదు సార్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

గురువారం, 2 జూన్ 2022 (15:31 IST)
పెంపుడు జంతువులపై చాలామంది ప్రేమ వుంటుంది. ఇంట్లో కుక్క పిల్ల తప్పిపోతే వెతికిపెట్టాలని కొంతమంది ప్రకటనలు ఇచ్చిన దాఖలాల గురించి వినే వుంటాం. తాజాగా ఓ కోడిపుంజు చోరీకి గురైందంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులకు ఈ కేసు తలనొప్పిగా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం, తాటిగుంటపల్లి పంచాయతీ పరిధిలోని పెద్దవంకపల్లెకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి లక్ష్మయ్య కుమారుడు వెంకటాద్రి కోడిపుంజు చోరీ అయ్యిందంటూ.. లబోదిబోమంటూ వాల్మీకిపురం పోలీసులను ఆశ్రయించాడు.  
 
తన తెల్ల కోడి పుంజును దొంగలు ఎత్తుకెళ్లారు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్లారుముద్దుగా పెంచుకున్నజాతి కోడి పుంజును దొంగలు ఎత్తుకెళ్లారని వాపోయాడు. గత నెల 29వ తేదీన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు.  మూడు రోజుల క్రితం దొంగలు రూ. 9వేల విలువగల జాతి కోడిపుంజును ఎత్తుకెళ్లారు. 
 
గ్రామ పరిసరాల్లో కోడిపందాలు జరుగుతుంటాయని, పందాల కోసమే దొంగలు ఎత్తుకెళ్లారు అని అనుమానం వ్యక్తం చేశాడు. అయితే ఇందుకు భిన్నంగా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలతో సమానంగా పెంచుకున్న కోడిపుంజును దొంగలు ఎత్తుకెళ్లారు అని ఫిర్యాదు చేయడం గమనార్హం. వెంకటాద్రి ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్సై బిందుమాధవి మీడియాకు తెలిపారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు