చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, లోకేష్, కాసాని

శనివారం, 28 అక్టోబరు 2023 (15:37 IST)
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబును నారా భువనేశ్వరి, లోకేశ్, టీటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిశారు. 
 
ములాఖత్ ద్వారా ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. 
 
తన ఆరోగ్యం, జైల్లోని పరిస్థితులపై ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాసిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు