పోసానిపై మరో కేసు.. మిగిలిన స్టేషన్ల పీటీ వారెంట్లు సిద్ధం

ఠాగూర్

సోమవారం, 3 మార్చి 2025 (13:09 IST)
సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే శ్రీ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నమోదైన కేసులో పోసాని అరెస్టయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉంటున్న విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే పోసానీపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులో నమోదయ్యాయి. ఆయన అదుపులోకి తీసుకునేందుకు మిగిలిన పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు పీటీ వారెంట్లు జారీచేసేందుకు సిద్ధమవుతున్నారు. 
 
మరోవైపు, గుంటూరు జిల్లా నరసరావు పేట, అల్లూరు జిల్లా, అనంతపురం పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. అయితే, తాము కోర్టు అనుమతి తీసుకున్నామని, ముందుగా పోసానిని తమకే అప్పగించాలని నరసరావుపేట పోలీసులు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 
 
పోసానిపై ఒకేసారి మూడు పీటీ వారెంట్లు రావడంతో ఆయనను ముందుగా ఎవరికి అప్పగించాలనే దానిపై ఉన్నతాధికారులతో జైలు అధికారులు సమాసలోచనలు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన నిబంధనలను పరిశీలించారు. ఆ తర్వాత ఉన్నతధికారుల అనుమతితో నరసరావు పేట పోలీసులకు అప్పగించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు