ఏపీలో ఎన్నికలు జరపాలని ఆదేశించలేం: హైకోర్టు

మంగళవారం, 23 మార్చి 2021 (18:01 IST)
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలన్న పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు జరపాలని ఎస్‌ఈసీని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
 
ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా పడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు