ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి మన దేశమే కాదు ప్రపంచమే నవ్వుతోంది

శుక్రవారం, 15 డిశెంబరు 2023 (11:40 IST)
కర్టెసి-ట్విట్టర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి మన దేశం మాత్రమే కాదు ప్రపంచ మొత్తం నవ్వుతోంది. రాష్ట్ర విభజన జరిగినా మనకి ఓ కేపిటల్ లేకుండా చేసారు అంటూ తెలుగుదేశం నాయకురాలు రెడ్డప్పగారి మాధవీరెడ్డి అన్నారు. ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
 

రెడ్డప్పగారి మాధవీరెడ్డి గారు

కడప లాంటి చోట, మంచి నిర్ణయం, ఓక్క అవకాశం ఇస్తే “One of the best commanding voices” అవుతారు#Kadapa#TDPWillBeBack pic.twitter.com/Hik1gEoMh9

— Chakradhar Rajaneni (@CRajaneni) December 15, 2023
వైసిపి నాయకులకు పనీపాటలేదు. అభివృద్ధి గురించి అసలు ఆలోచన లేదు. రోడ్డు లేకుండా నారా లోకేష్ పైన కేసులు పెడతారంట. ఉచితాలు అంటూ బటన్ నొక్కేస్తున్నారు. మద్యం షాపుల్లో ప్రజలు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్న డబ్బు ఎక్కడికి పోతుందో చెప్పాలి. ప్రజల డబ్బులను వైసిపి ప్రభుత్వం పీక్కుతింటోంది అంటూ ఆమె మండిపడ్డారు.

ఈరోజు కడపనగరంలోని2వడివిజన్ దేవుని కడపలో "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ" పథకాలను వివరించేకార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో కడప నియోజకవర్గఇంఛార్జి రెడ్డప్పగారిమాధవిరెడ్డి గారు మరియు టీడీపీనాయకులు పాల్గొని ప్రజలసమస్యలు తెలుసుకుని టీడీపీవారికి అండగా ఉంటుందిఅని హామీఇచ్చారు pic.twitter.com/6y0mQw9lTG

— Reddeppagari Madhavi (@R_Madhavi_Reddy) December 14, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు