Raj Tarun trusts Chiranjeevi
పలు వివాదాలమధ్య నటుడిగా కెరర్ సాగిస్తున్న రాజ్ తరుణ్ కు ఈమధ్య సినిమాలు సక్సెస్ కాలేకపోతున్నాయి. అయినా ఆయనతో ఓ ఓటీటీ సినిమాను స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. ఈ చిత్రానికి చిరంజీవి అని పేరు పెట్టారు. ఆహా ఓటీటీ ఒరిజినల్ ఫిల్మ్ చిరంజీవ. ఈ చిత్రంలో కుషిత కల్లపు హీరోయిన్ గా నటించింది. అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. నవంబర్ 7వ తేదీ నుంచి చిరంజీవ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.