ఆయన బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడకు వెళ్ళి చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరుతున్నట్టు చెప్పారు. వైసిపిలో కొంతమంది నాయకులు తనను హీనంగా చూశారని, అధినేతను కలవాలన్నా కలవనివ్వకుండా చేశారని వాపోయారు.
పలమనేరులో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, అభివృద్థి కోసమే తాను పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. తనతో పాటు చిత్తూరుజిల్లాకు చెందిన మరికొంతమంది ఎమ్మెల్యేలు తెదేపాలో చేరేందుకు సిద్థంగా ఉన్నారని చెప్పారు.