Cm Revanthreddy, Porata samiti
చిత్రపురి కాలనీలోని అవినీతిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాలనీ పోరాట నాయకులు విన్నవించారు. తెలుగు సినీ వర్కర్స్ కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చిత్రపురికాలనీలో 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూమి కేటాయించింది. ఈ భూమిలో సొసైటీ కమిటీ సంక్షేమం ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని పిటీషన్ లో పేర్కొన్నారు. సి.ఎం.ను కలిసిన వారిలో కస్తూరి శ్రీనివాస్, మద్దినేని రమేష్, కాదంబరి కిరణ్, రవీంద్రనాథ్ ఠాగూర్,ఉదయ్ చౌదరి వున్నారు.