కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే, వార్షిక బడ్జెట్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని జనసేన పార్టీ అధినే పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి నిలదీయనున్నట్టు ఆయన ప్రకటించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం కేటాయింపులు లేకపోవడం తనను నిరాశకు గురి చేసిందన్నారు. దీనిపై త్వరలో ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని చెప్పిన పవన్, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చిస్తానని వెల్లడించారు.