మా బలమెంతో మాకు తెలుసు... తెలుగు రాష్ట్రాల్లో పోటీకి సై : పవన్ కళ్యాణ్

సోమవారం, 2 అక్టోబరు 2017 (11:58 IST)
గాంధీ జయంతి రోజున జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను పోటీకి దించనున్నట్టు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 175 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు చెప్పారు. 
 
ముఖ్యంగా, ఇరు రాష్ట్రాల్లో తమ బలమెంతో తమకు తెలుసునని, బలమున్నంత మేరకే పోటీ చేస్తామన్నారు. అన్ని చోట్లా తమ అభ్యర్థులు ఉండబోరని స్పష్టం చేశారు. గెలుపు ఖాయమని భావించిన ప్రతి చోటా జనసేన అభ్యర్థి పోటీలో ఉంటాడని చెప్పారు. 
 
ఈ మేరకు పవన్ కల్యాణ్ తన 'జనసేన' పార్టీ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేశారు. "మన బలం 175 ఉంటే 175 పోటీ చేద్దాం. మన బలం ఎంతుంటే అంత, 175 స్థానాలకి తెలంగాణ సహా అన్నింటికీ పోటీ చేస్తాం. లేదా బలం లేదు. మన బలం ఎంతో అంతే చేస్తాం" అని క్యాప్షన్ పెట్టారు. ఈ మేరకు ఉదయం 9.57కు ఆయన ట్వీట్ పెట్టగా అదిప్పుడు వైరల్ అయింది. 
 
అయితే, ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు మరింత సమయం ఉండటంతో జనసేన పోటీ చేసే అసెంబ్లీ స్థానాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అనేక నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణం జరగలేదు. ఎన్నికల నాటికి ఈ నిర్మాణం పూర్తయి, విజయం సాధిస్తామన్న నమ్మకం కుదిరితే ఆ స్థానాల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు