అత్యధిక పర్వతాలను అధిరోహించిన వ్యక్తిగా రికార్డును నెలకొల్పడమే లక్ష్యంగా ఆ రికార్డులతో అటూ ఆసియాకు, భారత్కు రాష్ట్రానికి పేరు తీసుకురావాలనే తన ఆకాంక్ష అని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడని దొరసానమ్మ వివరించారు. అతడి ఆచూకీకోసం హెలికాప్టర్ల ద్వారా గాలింపులు చేపట్టాలని అర్జెంటీనా, చీలీ దేశాలనుకోరుతున్నామని అన్నారు. తమను ఆదుకోవాలని తమ సోదరుడిని గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కుటుంబసభ్యులు సాయం కోరారు.