కాకినాడ జగన్నాథపురం అన్నమ్మఘాటీ సెంటర్ దుర్గాదేవి వీధికి చెందిన గుత్తుల దుర్గబాబు(34)కు భార్యలక్ష్మి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా అతడు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. దుర్గబాబు హీరో ప్రభాస్ అభిమాని. ఆదివారం ప్రభాస్ పుట్టినరోజు కావడంతో శనివారం రాత్రి తన ఇంటి సమీపంలో కరెంటు స్తంభం ఎక్కి ఫ్లెక్సీ కడుతుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు.
స్థానికులు దుర్గబాబును 108 వాహనంపై జీజీహెచ్కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ అంత్యక్రియలు ముగించుకుని చెరువులో స్నానానికి వెళ్లగా అక్కడ ఓ పసిబాలుడి మృతదేహాన్ని చూసి వారు షాక్ అయ్యారు. స్థానికంగా ఉండే ఓ వేద పాఠశాలకు చెందిన విద్యార్థిగా ఆ బాలుడిని గుర్తించారు. దీనిపై కాకినాడ వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఏఎస్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.