ఏపీలో జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలు

సోమవారం, 30 మార్చి 2020 (16:04 IST)
ఏపీలోని అత్యవసర పరిస్థితుల దృష్ట్యా అన్ని జిల్లాల కలెక్టర్లకు విశేషాధికారాలు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, ఆసుపత్రులు, ప్రైవేట్ వైద్యశాలలు ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే అధికారాన్ని కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక సదుపాయాలు, సిబ్బంది సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు ఐసోలేషన్ కోసం చర్యలు చేపట్టాని ప్రభుత్వం సూచించింది.

వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

అవసరాల మేరకు ఆసుపత్రులను ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వం.. కరోనా కేసులు పెరిగితే ప్రైవేటు వైద్యశాలలు, మెడికల్ కళాశాలలు, అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు