ఒక ఎమ్మెల్యే అధికారికంగా సెలవు కోరకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే, వారిపై అనర్హత చర్యలు ప్రారంభించవచ్చని ఆర్ఆర్ఆర్ పేర్కొన్నారు. అలాగే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే, పులివెందులలో ఉప ఎన్నిక అనివార్యమవుతుందని రఘురామరాజు అన్నారు.
అయితే, జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరై తన గళాన్ని వినిపించాలని ఆర్ఆర్ఆర్ ఆశించారు. మరోవైపు తన కస్టోడియల్ వేధింపుల కేసులో న్యాయం జరుగుతుందని రఘురామకృష్ణరాజు విశ్వాసం వ్యక్తం చేశారు. తన కస్టోడియల్ టార్చర్లో సునీల్ కుమార్ పాత్ర ఉందన్న రఘురామకృష్ణరాజు.. దోషులకు శిక్ష పడుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. అలాగే ఈ విషయంలో తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.