మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

సెల్వి

శనివారం, 16 ఆగస్టు 2025 (09:47 IST)
Chaganti Koteswara Rao
యానిమేటెడ్ సినిమా మహావతార్ నరసింహ కలెక్షన్ల పరంగా కుమ్మేస్తుంది. హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత‌ అల్లు అరవింద్ సమర్పణలో విడుదలై మంచి స్పందన రాబ‌ట్టుకుంది. 
 
తాజాగా ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ఈ సినిమాని వీక్షించారు. అల్లు అరవింద్, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డితో కలిసి థియేటర్‌లో ఆయ‌న ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మూవీపై స్పందించారు. 
 
"మన పురాణాలకు చాలా దగ్గరగా ఈ సినిమా ఉంది. భక్త ప్రహ్లాద సినిమాలా ఇది కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. మనుషులతో కాకుండా బొమ్మలతో తీశారు. కానీ ఆ భక్తి, ఆ భావం, ఆ అనుభూతి మాత్రం నిజంగా ఆధ్యాత్మికంగా అనిపించింది. 
 
ఈ సినిమా చూస్తుంటే నిజంగా నరసింహ అవతారాన్ని చూసిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా చివరి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చు" అని అన్నారు. గీతా ఆర్ట్స్, హోంబలే ఫిల్మ్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో మూవీపై చాగంటి కోటేశ్వరరావు ఇచ్చిన‌ రివ్యూ వీడియోను పంచుకున్నాయి.

Chaganti Koteswara Rao garu and K.I. Vara Prasad Reddy garu share their thoughts on #MahavatarNarsimha, applauding the team for delivering a truly divine experience.

Witness the divine saga at theatres near you. ????pic.twitter.com/qtHfd7XsJw

— Geetha Arts (@GeethaArts) August 15, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు