అనకాపల్లి జిల్లా కశింకోటలో శుక్రవారం వైకాపా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వైకాపాకు 11 సీట్లు ఎందుకు వచ్చాయో అర్థం కాలేదన్నారు. పోనీ మనకు అర్థం కాలేదంటే ఫర్వాలేదు... కూటమికి 164 సీట్లు ఎందుకు వచ్చాయో వారికీ కాలేదని వ్యాఖ్యానించారు.
తిరిగి వ్యవసాయం చేయాలి. పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగానే జగన్ చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించారు' అని చెప్పారు. నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు ఉంటే పక్కన పెట్టాలని సూచించారు. ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, వరుదు కల్యాణి తదితరులు పాల్గొన్నారు.