లవ్లీ యూనివర్శిటీలో తెలుగు విద్యార్థి సూసైడ్

ఆదివారం, 14 జులై 2019 (10:50 IST)
పంజాబ్ రాష్ట్రంలోని లవ్లీ విశ్వవిద్యాలయంలో ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని అనంతపురం జిల్లా వాసిగా గుర్తించారు. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో ఈ వర్శిటీ ఉండగా, ఇందులో భరత్ బీటెక్ చదువుతూ వచ్చాడు. ఈ క్రమంలో హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
నికంగా ఈ ఘటన విద్యార్థుల్లో కలకలాన్ని రేపింది. యూనివర్సిటీ యాజమాన్యం భరత్‌ కుటుంబానికి ఆత్మహత్యపై సమాచారం అందించింది. అయితే భరత్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఇతని సొంతూరు అనంతపురం జిల్లా గుడిపాడు గ్రామం. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు