పీర్ల పండుగ పర్వ దినాల్లో ముస్లింలు, హిందూవులు కలిసి రొట్టెల పండుగను జరుపుకోవడం ప్రత్యేకత. భక్తులు దర్గా వద్ద కోరికలు కోరుతూ.. నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ భక్తులు రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే రొట్టెలను భక్తులు తలపై వేసుకుని చెరువులో మునిగిన తర్వాత రొట్టెలను మార్పిడి చేసుకుంటారు.
ఈ పండుగకు రాష్ట్ర వ్యాప్తంగానే కాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. రొట్టెల పండుగ సందర్భంగా దర్గా వద్ద గంధ మహోత్సవం జరుగుతుంది. ఈ పండగలో అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.