నేను మగాడినని నిరూపించుకోవాలి... నన్ను ల్యాబ్‌కు పంపండి : రాజేష్

సోమవారం, 11 డిశెంబరు 2017 (20:13 IST)
చిత్తూరు జిల్లా జి.డి.నెల్లూరు మండలంలో పెళ్ళయిన రోజే తన భర్త రాజేష్ నపుంశకుడని అతడి భార్య శైలజ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో వీరి వ్యవహారం కాస్తా రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారి చివరకు కోర్టు మెట్లెక్కింది. అయితే తాజాగా తాను మగాడినే, తనకు లైంగిక పటుత్వ పరీక్షలు  చేయండంటూ చిత్తూరు కోర్టును ఆశ్రయించాడు రాజేష్. 
 
ఇప్పటివరకు క్రిమినల్ కేసుల్లో లైంగిక పటుత్వ పరీక్షలు చేసిన దాఖలాలు లేవని రాజేష్ తరపు న్యాయవాది త్రిమూర్తి చెబుతున్నారు. అయితే రాజేష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను తనకు పొటెన్సీ పరీక్ష చేయాలని పట్టుబడుతున్నాడు. నాలుగు రోజుల క్రితం చిత్తూరు మూడవ అదనపు కోర్టులో రాజేష్ పిటిషన్‌ను దాఖలు చేస్తే ఇప్పటివరకు కూడా న్యాయమూర్తి విచారణ జరపలేదు. 
 
గత రెండురోజులుగా వాయిదా వేస్తూనే వస్తున్నారు. త్వరగా తనను పొటెన్సీ పరీక్షలకు పంపించాలని రాజేష్ వేడుకొంటున్నాడు. నేను మగాడినని నిరూపించుకునేందుకు ఇదొక్కటే నాకున్న అవకాశమంటూ న్యాయమూర్తికి ఒక వినతిపత్రం కూడా రాజేష్ రాసి బంధువుల ద్వారా కోర్టుకు పంపాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు