"అన్నా, పెరియార్, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, ఎంజీర్, జయలలిత వంటి వారి గురించి కూడా తమిళనాడు బిజెపి మాజీ నాయకుడు అన్నామలై మురుగన్ భక్తుల మానాడులో మాట్లాడటంతో పాటు.. ఆయన పిలిచిన వెంటనే అన్నాడీఎంకే నేతలు వెళ్లడం బీజేపీకి బానిసలుగా మారిపోయారనేందుకు నిదర్శనమని దుయ్యబట్టారు.
ఆలయాలు వుండకూడదని చెప్పట్లేదు. అది దొంగల చేతికి మారకూడదు. దేవాలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇంకా పవన్ కల్యాణ్, నాయ్నార్ నాగేంద్రన్, అన్నామలైలు మదురై మురుగన్ మానాడును రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు.