వెంటనే అప్రమత్తమైన తిరుమల అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. 20 నిమిషాలకుపైగా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపన సిబ్బంది శ్రమించారు. ఆలయానికి విద్యుత్ సరఫరా జరిగే కేబుళ్లలో షార్ట్ షర్క్యూట్ వల్ల మంటలు వచ్చిన విషయం గుర్తించిన తితిదే సిబ్బంది కేబుళ్ళను సరిచేశారు. ఒక్కసారిగా మంటలు రావడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. జరిగిన సంఘటనపై తితిదే ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.