దీంతో అదే గ్రామానికి చెందిన గఫార్, గౌస్లతో మాట్లాడి, తన తండ్రిని హత్య చేయాలని పథకం వేశాడు. ఆపై నిందితులు శ్రీనివాసప్పకు పూటుగా మద్యం తాపించి, మామిడి తోటల్లోకి తీసుకువెళ్లి హత్య చేసి అక్కడే పూడ్చి పెట్టారు.
ఒక రోజంతా తండ్రి ఇంటికి రాకపోవడంతో ఏమీ తెలియనట్టుగా నరసింహులు తన తండ్రి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ ప్రారంభించిన పోలీసులకు నరసింహులు చెబుతున్న పొంతన లేని సమాధానాలతో అనుమానం వచ్చి తమదైనశైలిలో విచారించగా, అసలు విషయం ఒప్పుకున్నాడు. ఆపై హత్యకు సహకరించిన నిందితులూ లొంగిపోయారని, కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.