పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా తమిళం-తెలుగు ద్విభాషా ప్రాజెక్టు చేస్తోంది. కీర్తిశ్వరన్ ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం కానున్నారు. 'ప్రేమలు' చిత్రంతో అందరినీ అలరించిన మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.
ఈరోజు ఈ సినిమా టైటిల్ను అఫీషియల్ గా విడుదల చేశారు, అద్భుతమైన ఫస్ట్ లుక్ను రివిల్ చేయడంతో పాటు, విడుదల తేదీకి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేశారు. యూత్ ని ఆకట్టుకునే విధంగా 'డ్యూడ్' అనే టైటిల్ తో రూపొందిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రదీప్ రంగనాథన్ ఇంటెన్స్ అవతార్ లో, ముఖం మీద గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకుని కనిపించారు. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లో సూచించినట్లుగా, డ్యూడ్ మోడరన్ ట్విస్ట్ తో కూడిన పూర్తి ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రం 2025 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ ని ఎంపిక చేసింది. ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్గా, భరత్ విక్రమన్ ఎడిటర్గా పని చేస్తున్నారు.
ప్రొడక్షన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో జరుగుతుండటంతో దీపావళికి సరైన ఎంటర్టైనర్ ను అందించడానికి టీం వేగంగా పని చేస్తోంది. డ్యూడ్ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.