ఈ నెల 12న విజయవాడ - విశాఖ ఎక్స్‌ప్రెస్ రద్దు.. ఎందుకంటే?

బుధవారం, 8 సెప్టెంబరు 2021 (08:06 IST)
ఈ నెల 12వ తేదీన విజయవాడ - విశాఖపట్టణం ప్రాంతాల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు. విజయవాడ - నిడదవోలు సెక్షన్‌లో ట్రాక్ మరమ్మతులు, ఇంజనీరింగ్ పనులు జరుగుతున్న కారణంగా ఈ రైలు సేవలను నిలిపివేశారు. 
 
ఈ రెండు రైళ్ళతో పాటు మరో రెండు రైళ్లను మళ్లిస్తుండగా, మరో రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విశాఖపట్టణం - లింగంపల్లి రైలు (02831)ను ఈ నెల 12 నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా మళ్లిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
 
అలాగే, లింగంపల్లి నుంచి విశాఖ వెళ్లే రైలు (02832)ను కూడా అదే రోజున అవే స్టేషన్ల గుండా మళ్లిస్తున్నట్టు పేర్కొన్నారు. విశాఖపట్టణం - విజయవాడ (02717), విజయవాడ - విశాఖపట్టణం (02718) రైళ్లను 12న రద్దు చేసినట్టు వివరించారు. సికింద్రాబాద్ - చాప్రా (07051, 07052) రైళ్లను ఈ నెల 28 వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు