అక్టోబ‌రు 28న‌ టిటిడి జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు

సోమవారం, 25 అక్టోబరు 2021 (21:30 IST)
టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరంలో ప్ర‌వేశానికి గాను  అక్టోబ‌రు 28న ఉద‌యం 9 గంట‌ల‌కు ఆయా క‌ళాశాల‌ల్లో స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు టీటీడీ  సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

టిటిడిలో విధులు నిర్వ‌హిస్తున్న రెగ్యుల‌ర్‌, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పిల్ల‌లు,  మొద‌టి, రెండో విడ‌త‌లో కౌన్సెలింగ్‌కు హాజ‌రు కానివారు, తిరుప‌తిలోని  స్థానికులు, జిపిఏ 10 నుండి 9.7 వ‌ర‌కు ఉన్న విద్యార్థుల‌కు ప్రాధాన్య‌త ఉంటుంది.  అదేవిధంగా మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు జిపిఏ 9.6 కంటే త‌క్కువ ఉన్న విద్యార్థుల‌కు అడ్మిష‌న్లు నిర్వ‌హిస్తారు. 
 
ఇదివ‌ర‌కే  http://admissions‌.tirumala.org ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకున్న విద్యార్థులు, సంబంధిత  క‌ళాశాల‌లో సీట్లు మాత్ర‌మే కావాల్సివారు, ధ్రువీక‌ర‌ణ‌ప‌త్రాలు, ఫీజుల‌తో నేరుగా సంబంధిత జూనియ‌ర్ క‌ళాశాల‌లో స్పాట్ అడ్మిష‌న్లకు హాజ‌రుకావాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు