అయితే, ఈ మల్లన్ సాగర్ భూనిర్వాసితుల మహాధర్నా నిర్వహించారు. ఇందులో రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్ పాల్గొని ప్రసంగిస్తూ ప్రాజెక్టుల పేరిట రైతులను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, హరీశ్ రావులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్న వేళ, హరీశ్ రావు రహదారులను దిగ్బంధం చేసి వంటలు వండుకుని తినలేదా? వాళ్లు చేస్తే కరెక్ట్, భూములు పోతాయన్న భయంతో ప్రజలు అదే పని చేస్తే తప్పా? అని పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి చంద్రకుమార్ ప్రశ్నించారు.