జే బ్రాండ్' మద్యంపై TDP ఆందోళ‌న‌లు

మంగళవారం, 22 మార్చి 2022 (12:20 IST)
అమరావతిలోని సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ టీడీపీ శాసనసభాపక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. ఏపీ ప్ర‌భుత్వ తీరుకి నిర‌స‌న‌గా టీడీపీ నేత నారా లోకేశ్ నేతృత్వంలో ఆ పార్టీ నేత‌లు ప్ల‌కార్డులు ప‌ట్టుకుని ఆందోళ‌న తెలిపారు.
 
కల్తీ నాటు సారా, జే బ్రాండ్ మద్యం వల్ల వందలాది మంది చనిపోతున్నార‌ని టీడీపీ నేతలు ఆరోపించారు. కోడికత్తి ఘ‌ట‌న న‌కిలీద‌ని, సారా మరణాలు నిజమ‌ని ప్లకార్డులు ప్రదోర్శించారు.
 
అలాగే, బాబాయి గుండెపోటు ఫేక్ అని, కల్తీ మద్యం నిజం అని టీడీపీ నేత‌లు నినాదాలు చేశారు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తోంద‌ని అన్నారు. ఏపీలో జే బ్రాండ్ మద్యంతో పాటు కల్తీసారా, గంజాయి, నార్కోటిక్స్ డ్రగ్స్ పెరిగిపోయాయ‌ని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు