రాష్ట్రానికి జగనన్న ఆంధ్రప్రదేశ్‌ అనే పేరు మార్చడం ఖాయం..

శుక్రవారం, 7 అక్టోబరు 2022 (17:19 IST)
ఎన్టీఆర్‌ పేరిట ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఎందుకు రద్దు చేశారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు నిలదీశారు. వైకాపా మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి జగనన్న ఆంధ్రప్రదేశ్‌గా పేరు మార్చటం ఖాయమని ఎద్దేవా చేశారు. 
 
చిక్కాల మాట్లాడుతూ వైకాపాకు పేర్లు మార్చటం, కట్టడాలను ధ్వంసం చేయడంపై ఉన్న శ్రద్ధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై లేదన్నారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ ఆరోగ్య యూనివర్సిటీ పేరును ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
 
లోకేశ్‌ యువజన ఫౌండేషన్‌ తరఫున ఆ సంస్థ గౌరవాధ్యక్షుడు చుండ్రు వీర్రాజు చౌదరి మొబైల్‌ అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు